R Krishnaia: ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2023-08-31T21:11:19+05:30 IST

ష్ట్రంలో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను (Teacher Posts Vacant) భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah)డిమాండ్ చేశారు.

R Krishnaia: ఖాళీగా ఉన్న  టీచర్ పోస్టులను భర్తీ చేయాలి

సంగారెడ్డి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను (Teacher Posts Vacant) భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah)డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 4900 పోస్టులు భర్తీ చేయాలి. గత 25 సంవత్సరాలుగా ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీ చేయడం లేదు. తక్కువ పోస్టుల భర్తీతో నిరుద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ఖాళీగా ఉన్న పోస్టులన్నీంటినీ భర్తీ చేయాలి.. లేనిపక్షంలో ఉద్యమిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.

Updated Date - 2023-08-31T21:11:19+05:30 IST