Vijayashanti: ఆమ్ ఆద్మీకి లంచాల బురద ఇమేజి తెచ్చింది కేసీఆరే..!

ABN , First Publish Date - 2023-03-10T22:39:55+05:30 IST

బీఆర్ఎస్‌(BRS)ను కనీసం పక్క రాష్ట్రాల్లో కూడా ఇంతవరకూ ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదనీ, కానీ ఢిల్లీ లిక్కర్ కేసు ద్వారా భారతదేశం మొత్తం బీఆర్ఎస్‌, కేసీఆర్ (CM KCR) గురించి తెలుసుకుందని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanti: ఆమ్ ఆద్మీకి లంచాల బురద ఇమేజి తెచ్చింది కేసీఆరే..!

హైదరాబాద్: బీఆర్ఎస్‌(BRS)ను కనీసం పక్క రాష్ట్రాల్లో కూడా ఇంతవరకూ ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదనీ.. ఢిల్లీ లిక్కర్ కేసు ద్వారా భారతదేశం మొత్తం బీఆర్ఎస్‌, కేసీఆర్ (CM KCR) గురించి తెలుసుకుందని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి అన్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్నా హజారే (Anna Hazare) స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (
Aam Aadmi Party) కి కూడా లంచాల బురద ఇమేజిని బీఆర్ఎస్‌, కేసీఆర్ & కో తెప్పించిందన్నారు.పైగా ఈ స్కామ్ నుంచి జనం దృష్టిని మళ్లించడానికే అన్నట్టు.... గతంలో కాంగ్రెస్(Congress) పార్టీతో జట్టుకట్టినప్పుడు కనీసం గుర్తుకురాని మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్‌ ఎత్తుకుందని ఈ విషయాన్ని బట్టి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కుట్రపూరిత నైజమేంటో గ్రహించవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అవినీతికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే... ఏది ఏమైనా ఈ రోజు దేశంలోని అవినీతి పార్టీలన్నీ బీజేపీ లక్ష్యంగా చేస్తున్న దాడి ద్వారా... దేశంలోని అవినీతి నేతల అద్భుత ఐక్యత ప్రజలందరికీ అర్థమవుతోందని.. ఎప్పటికైనా ధర్మం జయిస్తుందని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-03-10T23:18:08+05:30 IST