Dharmapuri Election Issue: జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్.. అయోమయంలో అధికారులు

ABN , First Publish Date - 2023-04-10T13:01:14+05:30 IST

జిల్లాలో ధర్మపురి రగడ హీటెక్కిస్తోంది. జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోనుంది.

Dharmapuri Election Issue: జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్.. అయోమయంలో అధికారులు

జగిత్యాల: జిల్లాలో ధర్మపురి రగడ హీటెక్కిస్తోంది. జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ (EVM Strong Room) తెరుచుకోనుంది. ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ భాషా స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు చేరుకున్నారు. అయితే స్ట్రాంగ్ రూం తాళం కనిపించక అయోమయం నెలకొంది. ఉదయం పది గంటలకే తాళాలు తెరుచుకోవాల్సి ఉండగా.. మధ్యాహ్నం గడుస్తున్నప్పటికీ ఇంకా తెరుచుకోలేదు. దీంతో తాళాలు పగులగొట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈవీఎంలు భద్రపరిచిన కాలేజీలో తేనెతుట్టె కదిలింది. దాంతో భవనంలో ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అధికారులు, వివిధ పార్టీల కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి పరుగుతీశారు.

స్ట్రాంగ్ వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ తెరిచి కోర్టు అడిగిన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి కోర్టుకు పంపిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లో డాక్యుమెంట్ల పరిశీలనను వీడియో గ్రఫీ చేస్తామని కలెక్టర్ యాస్మిన్ తెలిపారు.

కాగా... గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల చెల్లదంటూ ఆయన ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పోరాటం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 2018లో అక్రమంగా కొప్పుల ఈశ్వర్ గెలిచారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఇవాళ స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ తెరిచారు. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరిచారు. అనంతరం అందులోని కీలక డాక్యుమెంట్లను నిర్ణిత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-04-10T13:01:14+05:30 IST