Nagam: మర్రి జనార్దన్రెడ్డి పద్ధతి మార్చుకోవాలని నాగం హెచ్చరిక

ABN , First Publish Date - 2023-01-07T17:07:20+05:30 IST

మార్కండేయ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని నాగం జనార్ధన్రెడ్డి (Nagam Janardhan Reddy) డిమాండ్ చేశారు.

Nagam: మర్రి జనార్దన్రెడ్డి పద్ధతి మార్చుకోవాలని నాగం హెచ్చరిక

నాగర్కర్నూల్: మార్కండేయ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని నాగం జనార్ధన్రెడ్డి (Nagam Janardhan Reddy) డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం శిలాఫలకం వేసి 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని నాగం గుర్తు చేశారు. అయితే ప్రాజెక్ట్కు రూ.76.96 కోట్ల నిధులు మంజూరు చేసినా తట్ట మట్టిని కూడా తీయించలేదని నాగం జనార్ధన్రెడ్డి విమర్శించారు. పనులు ప్రారంభించకపోతే శిలాఫలకం దగ్గర దీక్షకు కూర్చుంటానని నాగం హెచ్చరించారు. దౌర్జన్యాలకు దిగుతున్న టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి (marri janardhan reddy) పద్ధతి మార్చుకోవాలని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-01-07T17:09:45+05:30 IST