Warangal Dist.: ఇటుకాలపల్లిలో నిందితుల అరెస్టు..

ABN , First Publish Date - 2023-07-07T15:12:34+05:30 IST

వరంగల్ జిల్లా: ఇటుకాలపల్లిలో జరిగిన ఘటనలో యువతి తండ్రి సహా 11 మంది బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు బైకులు, 10 సెల్ ఫోన్లు, రెండు గొడ్డళ్లు, మూడు వేట కొడవళ్ళు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.

Warangal Dist.: ఇటుకాలపల్లిలో నిందితుల అరెస్టు..

వరంగల్ జిల్లా: ఇటుకాలపల్లిలో జరిగిన ఘటనలో యువతి తండ్రి సహా 11 మంది బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు బైకులు, 10 సెల్ ఫోన్లు, రెండు గొడ్డళ్లు, మూడు వేట కొడవళ్ళు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయినవారిలో యువతి తండ్రి మండల్ రవీందర్ (బీఆర్ఎస్ సర్పంచ్) ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారని చెప్పారు.

తన కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుందని యువకుడి ఇంటితోపాటు స్నేహితుల ఇంటికి యువతి తండ్రి నిప్పుపెట్టారు. ఈ ఘటన ఇటుకాలపల్లిలో కలకలం రేగింది. బాధితుల పిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం, ఇటుకాలపల్లిలో బీఆర్ఎస్ సర్పంచ్ రవీందర్ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రవీందర్ వివాహం చేసుకున్న రంజిత్, అతని స్నేహితుల ఇళ్లకు (మొత్తం నాలుగు) రవీందర్, అతని అనుచరులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఇళ్లు పూర్తిగా దహనమయ్యాయి. దీంతో బాధితులు ప్రాణ భయంతో వరంగల్‌కు వెళ్లిపోయారు. పోలీసులు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. దీన్ని ఏబీఎన్ ప్రసారం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విచారణ జరిపి పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాణహాని ఉందని భయపడుతున్న ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-07-07T15:12:34+05:30 IST