Share News

Minister Surekha: మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చు

ABN , Publish Date - Dec 26 , 2023 | 08:08 PM

మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Minister Surekha: మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చు

హనుమకొండ: మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అధికారులు విధుల్లో అలసత్వం వహించొద్దని ఆదేశించారు.ఎమ్మెల్యేలు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీవరకు అప్లికేషన్స్ తీసుకుంటామని తెలిపారు. పార్టీలో లోపాలు ఉన్నా సరిదిద్దుకుంటామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 08:08 PM