Modi Tour: బీజేపీలో అసంతృప్తికి తెరతీసిన ప్రధాని పర్యటన

ABN , First Publish Date - 2023-07-08T12:04:41+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన తెలంగాణ బీజేపీలో అసంతృప్తికి తెరతీసింది.

Modi Tour: బీజేపీలో అసంతృప్తికి తెరతీసిన ప్రధాని పర్యటన

వరంగల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన
(PM Modi Warangal Tour) తెలంగాణ బీజేపీలో అసంతృప్తికి తెరతీసింది. వరంగల్ మోదీ సభా వేదికపై చోటు కల్పించకపోవటంపై సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, ఆమర్ సింగ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లోకసభ నియోజకవర్గం ఇంచార్జ్‌గా చింతా సాంబమూర్తి ఉన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్‌గా, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా కూడా చింతా సాంబమూర్తి పనిచేశారు. అలాగే అమర్ సింగ్ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. ఈ క్రమంలో తన లోక్‌సభ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రధాని సభలో వేదికపై చోటు ఇవ్వకపోవడంతో చింతా సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన వారికి ఉన్న ప్రాధాన్యత.. బీజేపీలో దళితులకు లేదని సీనియర్లు వాపోతున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Updated Date - 2023-07-08T12:04:41+05:30 IST