Share News

Gun : రాజీకొస్తావా.. కాల్చిపారేయాలా..?

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:21 AM

మండల పరిధిలోని సుద్దకుంటపల్లిలో గంగాధర్‌ అనే వ్యక్తి నాటు తుపాకీతో మంగళవారం హల్‌చల్‌ చేశాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో రాజీకి రావాలని బెదిరించాడు. దీంతో బాధితులు ఎదురు తిరిగి గంగాధర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. గంగాధర్‌ తనను వేధిస్తున్నారని సుద్దకుంటపల్లికి చెందిన ఎంపీటీసీ సాయిలీల ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ...

Gun : రాజీకొస్తావా..  కాల్చిపారేయాలా..?
Members of the MPTC family grabbing the gun from Gangadhar (the man in the black shirt).

తుపాకీతో నిందితుడి హల్‌చల్‌

చితకబాది.. పోలీసులకు అప్పగించిన బాధితులు

రామగిరి, సెప్టెంబరు 10: మండల పరిధిలోని సుద్దకుంటపల్లిలో గంగాధర్‌ అనే వ్యక్తి నాటు తుపాకీతో మంగళవారం హల్‌చల్‌ చేశాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో రాజీకి రావాలని బెదిరించాడు. దీంతో బాధితులు ఎదురు తిరిగి గంగాధర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. గంగాధర్‌ తనను వేధిస్తున్నారని సుద్దకుంటపల్లికి చెందిన ఎంపీటీసీ సాయిలీల ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో రాజీకి రావాలని ఎంపీటీసీ భర్తను, బంధువులను నాటు


తుపాకీతో గంగాధర్‌ బెదిరించాడు. దీంతో ఎంపీటీసీ భర్త కేశవ, వారి కుటుంబ సభ్యులు గంగాధర్‌పై ఎదురుదాడికి దిగి, కర్రలతో చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ సుద్దకుంటపల్లికి వెళ్లి స్థానికులను విచారించారు. తుపాకీని స్వాధీనం చేసుకుని, గంగాధర్‌ను పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. గంగాధర్‌ వైసీపీలో ఉండేవాడు. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరాడు. గొడవ అనంతరం ఇరువర్గాలవారు రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 11 , 2024 | 12:21 AM