Share News

Andhra Pradesh: ఇంత ఘోరం ఎప్పుడూ లేదు.. సీఎం షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Jul 24 , 2024 | 09:59 PM

2014 విభజన తరువాత కూడా రాష్ట్రం ఇంత సంక్షోభంలో లేదని.. పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో..

Andhra Pradesh: ఇంత ఘోరం ఎప్పుడూ లేదు.. సీఎం షాకింగ్ కామెంట్స్..
CM Chandrababu

అమరావతి, జులై 24: 2014 విభజన తరువాత కూడా రాష్ట్రం ఇంత సంక్షోభంలో లేదని.. పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం.. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వ నిధులూ దుర్వినియోగం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని వ్యవస్థలను మళ్లీ యాక్టివ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అన్ని సార్లూ రూల్స్ అనే కోణంలో కాకుండా.. మానవీయ కోణంలోనూ పనిచేయాలని సీఎం సూచించారు. పేదరికం లేని సమాజం కోసం అంతా కలిసి పనిచేద్దామని.. అధికారులు సహకరించాలని సీఎం కోరారు.


సమావేశంలో సీఎం చంద్రబాబు కామెంట్స్ పాయింట్స్ యధావిధిగా..

• నేను 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ ఎప్పుడూ లేనన్ని సమస్యలు, భిన్నమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది.

• తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతోంది.

• నాడు తీసుకున్న నిర్ణయాలు, తెచ్చిన పాలసీల వ‌ల్లే అక్కడ ఈ ఫలితాలు వచ్చాయి.

• అమెరికాలో కూడా భార‌తీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు.

• వైట్ అమెరికన్స్ 65 వేల డాలర్లు తలసరి ఆదాయం పొందుతున్నారు.

• కానీ ఇండియన్స్ 1.19 లక్షల డాలర్ల తలసరి ఆదాయం పొందుతున్నారు.

• తెలుగు వాళ్లు ప్రపంచంలో, దేశంలో ముందుకు వెళుతున్నారు.

• కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెల‌కొంది.

• 1978లో నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను.


• మొన్న ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 57 శాతం ఓట్ షేర్ వచ్చింది.

• గత 5 ఏళ్లు ప్రజలు పడిన కష్టాల కారణంగా వచ్చిన ఫలితం ఇది.

• ప్రజలు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అని ఇతర రాష్ట్రాలకు ఉపాదికోసం వెళ్లిన వాళ్లు.. ఇతర దేశాల్లో ఉన్న వారు వచ్చి ఓట్లు వేశారు.

• మొన్నటి ఎన్నికలు ఒక నిశ‌బ్ద విప్లవం.

• ఈ ఫ‌లితాల‌తో ఒక కొత్త చరిత్రకు నాంది పలికారు.

• 2014లో లోటు బడ్జెట్‌తో పాలన ప్రారంభించినా 43 శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు అండగా నిలిచాం.


• 2014 కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి.

• రూ.ల‌క్ష కోట్ల వ‌ర‌కు బిల్లులు, బకాయిలు ఉన్నాయి. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.

• నాడు 13.5 శాతం వృద్ది రేటు సాధించిన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఇలా ఉంది.

• విభజనకంటే ఎక్కువ నష్టం 2019 నుంచి ఉన్న వైసీపీ పాలన వల్ల జరిగింది.

• కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది.

• మూడు పార్టీలుగా కలిసి పోటీ చేశాం. కేంద్రం కూడా ఇప్పుడు సాయం చేయ‌డానికి ముందుకు వచ్చింది. ఇది మంచి పరిణామం.

• పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

• రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉంది.

• ఎన్నికల సమయంలో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అని చెప్పాం.. దాన్ని నిజం చేసి చూపించాలి.


• నాడు తెచ్చిన పాలసీలు అన్నీ పక్కన పడేశారు. నాడు ఈసేవ తెచ్చాం.. తరువాత రియల్ టైం గవర్నెన్స్ తెచ్చాం. ఇలాంటి వ్యవస్థలు అన్నీ గత ప్రభుత్వం మూలన పడేసింది.

• మీ మీ శాఖల్లో ఉన్న వ్యవస్థలను యాక్టివ్ చేయండి. అధికారులు కూడా సెన్సిటివ్‌గా పనిచేయాలి.

• కేంద్రం ఏఏ శాఖలకుఎంత నిధులు ఇస్తుంది అనేది తెలుసుకోవాలి.

• గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర పథకాలు కూడా ఉపయోగించుకోలేదు.

• నేను కేంద్ర మంత్రులు వద్దకు వెళితే గత ప్రభుత్వం కనీసం యుటిలిటీ స‌ర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని, నిధులు దారి మ‌ళ్లించార‌ని చెప్పారు.

• అంటే గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో ఆలోచించాలి.

• ఏడాదిలో కేంద్రం నుంచి ఎంత మేర నిధులు తేగలం అనేది చూసి.. అంత‌మేర కేంద్రం నుంచి తీసుకు వచ్చేలా అధికారులు పనిచేయాలి.

• కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం నిధులు తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించండి.

• శాంతి భ‌ద్రత‌ల విష‌యంలో మా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. రౌడీలను అణిచివేస్తాం.


• గంజాయి అనేది లేకుండా చేస్తాం. ఈ విషయంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి.

• పేదరికం లేని సమాజం అనేది మా ప్రభుత్వం లక్ష్యం. దీని కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది.

• ప్రభుత్వ పాలసీలు పక్కాగా అమలు చేయడం ద్వారా పేదరికం తగ్గించవచ్చు.

• కలిసి ముందుకు వెళదాం. ప్రగ‌తిశీల, ప్రభావాత్మక పాల‌న (ప్రోగ్రసివ్, ఎఫెక్టివ్ గవర్నెన్స్) అందిద్దాం.

• ఓట్లు వేరు.. ప్రజలకు మంచి చేయడం వేరు. ప్రతి పనికీ రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మంచి చేశాం అనే ఒక తృప్తి ఉంటుంది.

• నా అరెస్టు సమయంలో అంతమంది రోడ్డెక్కడానికి కారణం అంతకుముందు నేను చేసిన మంచే కారణం.

• మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు.

• అధికారులు కూడా బ్యూరోక్రటిక్ కోణం కాకుండా.. మాన‌వీయ కోణంతో పనిచేయాలి.

• ప్రజలు సాయం కోరి వస్తే.. ఆ సమస్య ఎలా పరిష్కరించాలి అని ఆలోచించాలి. కేవ‌లం రూల్స్ గురించి మాత్రమే ఆలోచిస్తే అందరికీ మంచి చేయలేం.

• ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలి.

• కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలి.


• మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచించాలి.

• పరిపాలనలో భాగంగా అధికారులకు తన వైపు నుంచి 100 శాతం మద్దతు ఉంటుంది.

• అధికారులకు వీలైనంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అందిస్తాను.

• అధికారులెవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే నేనూ కఠినంగా ఉంటాను.

• గంటల తరబడి సమీక్షలకు తాను స్వస్తి పలికాను.

• అధికారులు కూడా రిజల్ట్ ఒరియేంటెడ్ పద్దతిలో సమీక్షలు చేపట్టాలి.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 24 , 2024 | 09:59 PM