Share News

YCP: మంత్రి పెద్దిరెడ్డిపై కదిరి వైసీపీ నేతల రివర్స్ ఎటాక్

ABN , Publish Date - Jan 13 , 2024 | 03:25 PM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy ) పై కదిరి వైసీపీ నేతలు ( YCP Leaders ) రివర్స్ ఎటాక్ చేశారు. ‘మా జిల్లా... నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటి’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు విరుచుకుపడ్డారు.

YCP: మంత్రి పెద్దిరెడ్డిపై కదిరి వైసీపీ నేతల రివర్స్ ఎటాక్

అనంతపురం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy ) పై కదిరి వైసీపీ నేతలు ( YCP Leaders ) రివర్స్ ఎటాక్ చేశారు. ‘మా జిల్లా... నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటి’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు విరుచుకుపడ్డారు. సర్వేల పేరుతో తమ నేతల భవిష్యత్తును నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల పక్కనే ఉన్న కదిరిలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. కదిరి అసెంబ్లీ టికెట్‌ను 25 కోట్లకు వైసీపీ జోనల్ ఇన్‌చార్జి అమ్మేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సామాజిక మాధ్యమంలో వైసీపీ నేత పోస్టులు పెట్టడం చర్చానీయాంశంగా మారింది.

Updated Date - Jan 13 , 2024 | 03:25 PM