Share News

Karunakar Reddy: ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

ABN , Publish Date - May 12 , 2024 | 07:30 AM

తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు.

Karunakar Reddy: ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై (Andhrajyothy Journalists) టీటీడీ చైర్మన్ (TTD Chairman) కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) నోరు పారేసుకున్నారు (Comments). ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే (APUWJ) తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి (Prasad Reddy) టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు. జర్నలిస్టులపై అవాస్తవ ఆరోపణలు చేయటం తగదని, అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.


జిరాక్స్ షాప్‌లో పార్టనర్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారో తిరుపతిలో జర్నలిస్టులందరికీ తెలుసునని ప్రసాద్ రెడ్డి అన్నారు. కరుణాకర్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. అబద్ధపు ఆరోపణ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు ఆందోళనకు కార్యాచరణ రూపొందించాలని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

పింఛను దానం కాదు.. హక్కు ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 12 , 2024 | 07:33 AM