Share News

AP Elections: జగన్ సభల కోసం.. పిఠాపురంలో విధ్వంసం

ABN , Publish Date - May 09 , 2024 | 09:29 PM

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల కోసం ఆ పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో...

AP Elections: జగన్ సభల కోసం..  పిఠాపురంలో విధ్వంసం

కాకినాడ: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ఎన్నికల ప్రచార సభల కోసం ఆ పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ ఎన్నికల ప్రచారం (Election campaign) నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో సభా స్థలం కోసం ఆ పార్టీ నాయకులు హల్‌చల్ చేస్తున్నారు. పిఠాపురం మెయిన్ రోడ్‌లో దారి పొడవునా ఉన్న చెట్లన్నీ నరికేశారు.


అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం కాంక్రీట్ వేస్తున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై స్థానికులు మండిపడుతున్నారు. సభల పేరుతో చెట్లను నరికేయడం, క్రీడా మైదానాల్లో కాంక్రీట్ వేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో ఆటలు ఆడుకునేందుకు ఉన్న మైదానం ఇదొక్కటే అని.. అందులో కూడా కాంక్రీట్ నిర్మాణం చేపట్టడంతో ఇక ఆటలు ఆడుకునే అవకాశమే లేకుండా పోయిందని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 09:29 PM