Home » Andhra Pradesh » Elections
Andhrapradesh: ఎన్నికల వేళ అధికారపార్టీ వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి...
Andhrapradesh: మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి కారును చెక్ చేస్తున్నారు. రూ.50 వేలు ఆపై నగదు తీసుకెళ్లే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. నగదు వివరాలు, సంబంధిత పత్రం చూపిస్తే వదిలేస్తున్నారు. లేదంటే సీజ్ చేస్తున్నారు. గోపయ్య అనే వృద్దుడు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడు. ఏపీలో మందు బ్రాండ్లు మారడంతో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు.
ఏపీలో అందరిదృష్టి ఆకర్షిస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో నెల్లూరు ఒకటి. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి సైతం వైసీపీ, టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఎవరు విజయం సాధిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
Andhrapradesh: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ యువగళం సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్కు సూచిస్తున్నానన్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు.వేపగుంటా మీనాక్షి కన్వేషన్స్లో కూటమి ఆద్వర్యంలో ఎలైట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు..కూటమి పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు.
అధికార వైసీపీ(YSRCP) అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతలపై కుట్రకు పన్నింది. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుగా ఉన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav)పై పోలీసులను ఉసిగోల్పుతున్నారు.