Share News

AP Election Polling 2024:మాచర్లలో పిన్నెల్లి సోదరుల విధ్వంసం

ABN , Publish Date - May 13 , 2024 | 03:04 PM

జిల్లాలో పోలింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ కుట్రలు పన్నింది. జిల్లాలోని మాచర్లలో వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు విధ్వంసం సృష్టించారు . పట్టణంలోని పోలింగ్ కౌంటర్ల వద్ద వైసీపీ నేతలు రెచ్చిపోయి అరాచకాలకు తెగబడుతున్నారు.

AP Election Polling 2024:మాచర్లలో పిన్నెల్లి సోదరుల విధ్వంసం

పల్నాడు జిల్లా: జిల్లాలో పోలింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు పన్నింది. జిల్లాలోని మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు విధ్వంసం సృష్టించారు . పట్టణంలోని పోలింగ్ కౌంటర్ల వద్ద వైసీపీ నేతలు రెచ్చిపోయి అరాచకాలు, భారీ కుట్రలకు తెగబడుతున్నారు.


టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. రోడ్లపై కనిపించిన వాహనాలను ధ్వంసం చేస్తూ టీడీపీకి ఓటు వేయొద్దని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రోడ్లపై తిరిగే ప్రజలను కార్లతో గుద్దించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మాచర్ల పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది. దాడుల్లో స్వయంగా ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.


AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 03:53 PM