Home » Telugu Desam Party
Vadde Sobhanadriswara Rao: ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు. చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని వడ్డే శోభానాద్రీశ్వరరావు ఆరోపించారు.
Somireddy Chandramohan Reddy:మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని.. కానీ కాకాణి మాత్రం వారిని మించినవారని విమర్శించారు.
CM Chandrababu: . సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. స్వర్ణాంద్ర ప్రదేశ్ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు వారు ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.
Yanamala Ramakrishna: ట్రంప్ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వంపై అప్పుల భారం, వ్యక్తిగత రుణాలు ఈనాటి ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తున్నాయని చెప్పారు.
TDP Leaders Clash: అన్నమయ్య జిల్లా టీడీపీలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇవాళ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఎదుటనే ఢీ అంటే ఢీ అని కొట్టుకునే వరకు ఇరువర్గాల నేతలు వెళ్లారు. రెండు వర్గాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు మాత్రం వినకపోయే సరికి మంత్రి కూడా చేతులు ఎత్తేశారు. ఈ వివాదాన్ని టీడీపీ హై కమాండ్ దృష్టికి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
TDP MLA Venkataprasad : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ప్రజలు జగన్కు బుద్ధి చెప్పిన మార్పు రాలేదని అన్నారు.
TDP Leaders: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను బుధవారంనాడు తెలుగుదేశం నాయకులు కలిశారు. సాక్షి మీడియాపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
NRI TDP: ఛార్లెట్లో ఎన్నారై టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. చార్లెట్లోని వెడ్డింగ్టన్ రోడ్డులో ఉన్న బావార్చి ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ లో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు అందిస్తున్న సేవలను నేతలు కొనియాడారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు.