Share News

AP Election Polling 2024: శ్రీ సత్యసాయి జిల్లాలో టెన్షన్.. టెన్షన్ అసలేం జరుగుతోంది..?

ABN , Publish Date - May 13 , 2024 | 09:04 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (ap elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 4వ వార్డు శాంతినగర్‌లో ఉన్న పోలింగ్ కేంద్రం 164, 169, 170, 171 బూత్‌ల వద్ద రిగ్గింగులకు వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు పాల్పడుతున్నట్లు సమాచారం.

AP Election Polling 2024: శ్రీ సత్యసాయి జిల్లాలో టెన్షన్.. టెన్షన్ అసలేం జరుగుతోంది..?

శ్రీ సత్య సాయి జిల్లా: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 4వ వార్డు శాంతినగర్‌లో ఉన్న పోలింగ్ కేంద్రం 164, 169, 170, 171 బూత్‌ల వద్ద రిగ్గింగులకు వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు పాల్పడుతున్నట్లు సమాచారం.


ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సోదరుడు వెంకట కృష్ణారెడ్డి తన అనుచరులతో పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కూటమి ఎన్డీఏ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓటమి భయంతో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న పోలీస్ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యంపై సత్య కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని సత్య కుమార్ ధ్వజమెత్తారు.

AP Elections: ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ ఏజెంట్లపై దాడులు..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 09:10 PM