Share News

AP NEWS; ఈ నెల 22న సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

ABN , Publish Date - Feb 17 , 2024 | 06:50 PM

కాంగ్రెస్(Congress) పార్టీ ఈనెల 22వ తేదీన సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తక్కువ‌ పోస్టులు భర్తీ చేసేలా కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.

AP NEWS; ఈ నెల 22న సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

విజయవాడ: కాంగ్రెస్(Congress) పార్టీ ఈనెల 22వ తేదీన సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తక్కువ‌ పోస్టులు భర్తీ చేసేలా కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. సచివాలయం ముట్టడిలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, కేవీపీ రామచంద్రారావు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. ఇటీవలే డీఎస్సీ నోటిఫికేషన్‌పై షర్మిల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సచివాలయం ముట్టడిని విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 11:02 PM