Share News

Ramoji Rao: రామోజీరావు మృతి ఆవేదన కలిగించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:21 AM

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు మృతి ఆవేదన కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అడుగు పెట్టిన ప్రతీ రంగంలోనూ ఆయన తన మార్క్‌ను చూపించారన్నారు.

Ramoji Rao: రామోజీరావు మృతి ఆవేదన కలిగించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అమరావతి: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు మృతి ఆవేదన కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అడుగు పెట్టిన ప్రతీ రంగంలోనూ ఆయన తన మార్క్‌ను చూపించారన్నారు.

తెలుగు భాష, జర్నలిజానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 88ఏళ్ల వయస్సులోనూ క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన నడుచుకునే వారని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈరోజు తెల్లవారు జామున గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రామోజీరావు మృతిచెందిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 08 , 2024 | 10:29 AM