Share News

AP News: ప్రేమ వేధింపులు.. తండ్రిపై దాడి.. ఆవేదనతో బాలిక బలవన్మరణం

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:45 AM

Andhrapradesh: జిల్లాలోని ఫిరంగిపురం మండలం దారుణం చోటు చేసుకుంది. యువకుడి వేధింపుల కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మండలానికి చెందిన యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడు. యువకుడి వేధింపులు రోజు రోజుకు శృతిమించడంతో విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేసింది.

AP News: ప్రేమ వేధింపులు.. తండ్రిపై దాడి.. ఆవేదనతో బాలిక బలవన్మరణం
Girl commits suicide

గుంటూరు, జూలై 16: జిల్లాలోని ఫిరంగిపురం మండలం దారుణం చోటు చేసుకుంది. యువకుడి వేధింపుల కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మండలానికి చెందిన యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో బాలికను (Girl) వేధింపులకు గురిచేస్తున్నాడు. యువకుడి వేధింపులు రోజు రోజుకు శృతిమించడంతో విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేసింది. తనను అసభ్య పదజాలంతో దూషించాడని తండ్రికి చెప్పింది. దీంతో తమ కుమార్తె వెంటపడుతున్న యువకుడిని బాలిక తండ్రి మందలించాడు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు.. పెద్దవారని కూడా చూడకుండా స్నేహితులతో కలిసి బాలిక తండ్రిపై దాడి చేయించాడు.

CM Revanth: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే..


ఈ విషయం తెలిసిన బాలిక తీవ్ర మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మృతికి యువకుడే కారణమంటూ బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన యువకుడు.. పురుగుల మందు సేవించి బలవన్మరణానికి యత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో యువకుడికి చికిత్స కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

Virat Kohli: కోహ్లీతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది గంభీరే: అమిత్ మిశ్రా

Ram Prasadreddy: అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 11:45 AM