Share News

AP Govt: జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపుపై జీవో విడుదల

ABN , Publish Date - Jul 12 , 2024 | 08:38 PM

జర్నలిస్ట్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగించినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

AP Govt: జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపుపై జీవో విడుదల
Journalist Health Scheme

అమరావతి: జర్నలిస్ట్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగించినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేశారు. ఈ మేరకు హిమాన్షు శుక్లా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని వివరించారు.


ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని ప్రకటనలో వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) తరహాలో వైద్య సేవలు పొందవచ్చని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని వివరించారు. అదే విధంగా నిర్దేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని అన్నారు. ఈ పథకానికి డా. నందమూరి తారకరామారావు వైద్య సేవ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుందని వెల్లడించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయని తెలిపారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని డైరెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు.

Updated Date - Jul 12 , 2024 | 08:39 PM