Share News

AP News: మునిసిపల్ కార్యాలయం వెనుక వ్యక్తి సజీవ దహనం

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:21 AM

గుంటూరు జిల్లా తెనాలి మునిసిపల్ కార్యాలయం వెనుక వ్యక్తి సజీవ దహనమైన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆటో రవి అనే యాచకుడు మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. అయినవారు ఎవరూ లేకపోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో రవి ఉంటున్నాడు. గత రాత్రి నిద్రిస్తుండగా మస్కిటో కాయిల్స్ నుంచి మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు.

AP News: మునిసిపల్ కార్యాలయం వెనుక వ్యక్తి సజీవ దహనం

గుంటూరు: గుంటూరు (Guntur) జిల్లా తెనాలి మునిసిపల్ కార్యాలయం (Tenali Muncipal Office) వెనుక వ్యక్తి సజీవ దహనమైన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆటో రవి అనే యాచకుడు (Beggar) మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. అయినవారు ఎవరూ లేకపోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో రవి ఉంటున్నాడు. గత రాత్రి నిద్రిస్తుండగా మస్కిటో కాయిల్స్ ( Musquito Coil) నుంచి మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు. కాళ్లు చేతులు పనిచేయకపోవడంతో మంటలు చెలరేగినా బయటపడలేక అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో అటుగా వెళుతున్న బీట్ కానిస్టేబుల్స్ చూసి మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే రవి మృతి చెందాడు.

Exams: ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 10:21 AM