Home » Tenali
వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. తెనాలి పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడమే పాపమైంది. అంతే... వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లోని మున్సిపల్ హైస్కూల్లోని పోలింగ్ బూత్లో పోలిం గ్ ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగుచెందారు.
Andhrapradesh: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో ఓటర్పై వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపిక్ మిశ్రా స్పందించారు. ఓటర్పై చేయి చేసుకోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఐతా నగర్లో ఓటరను ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్ను తెప్పించాలని దీపక్ మిశ్రా ఆదేశించారు.
అధికార వైసీపీ తిక్క తీరేలా ఓ ఓటర్ చెంప పగలగొట్టడం గుంటూరులో చర్చనీయాంశం అయింది. తెనాలి వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్(Annabathuni Shiva Kumar) క్యూలైన్లో నిలబడి ఓటు వేయకుండా.. నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు.
ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల (AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
నేడు తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది. పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు సాయంత్రం తెనాలిలో ర్యాలీ, సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. నిన్న ఇరవై కిలోమీటర్లు ఎండలో పవన్ పాదయాత్ర చేశారు. ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పూర్తిగా జ్వరం తగ్గక పోవడంతో తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు.
Alapati Rajendra Prasad: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమిని కాసింత అసంతృప్తి కూడా వెంటాడుతోంది. టికెట్లు దక్కని సీనియర్లు, మాజీ మంత్రులు, సిట్టింగులు.. కీలక నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలను వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు..
గుంటూరు జిల్లా తెనాలి మునిసిపల్ కార్యాలయం వెనుక వ్యక్తి సజీవ దహనమైన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆటో రవి అనే యాచకుడు మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. అయినవారు ఎవరూ లేకపోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో రవి ఉంటున్నాడు. గత రాత్రి నిద్రిస్తుండగా మస్కిటో కాయిల్స్ నుంచి మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు.
సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి(28) అనే మహిళా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గీతాంజలి 7వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్కు తరలించారని అన్నారు.
తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్యకు గురైంది. 35 ఏళ్ల వివాహిత ఒకరు స్థానిక భవనం వారి వీధిలో నివాసం ఉంటోంది. ఆమెను అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.
రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీడీపీ-జనసేన కూటమికి కొత్త చిక్కులు వస్తున్నాయి. సీట్ల కేటాయింపుపై