Share News

Bhuvaneswari: ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా ‘నిజం గెలవాలి యాత్ర’ ట్రెండ్

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:39 PM

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను ఏపీ సీఐడీ స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలియడంతో పలువురు చంద్రబాబు అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురై చనిపోయారు.

Bhuvaneswari: ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా ‘నిజం గెలవాలి యాత్ర’ ట్రెండ్

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu)ను ఏపీ సీఐడీ స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియడంతో పలువురు చంద్రబాబు అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురై చనిపోయారు. అయితే బాధిత కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ద్వారా పరామర్శిస్తున్నారు. వారి కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సహాయం అందిస్తూ.. పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. ఆమె చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర హ్యాష్ ట్యాగ్ #NijamGelavali దేశ వ్యాప్తంగా ఎక్స్ (ట్విట్టర్) 2వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఆమె చేస్తున్న ‘‘నిజం గెలవాలి’’ యాత్రకు మద్దతుగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేల ట్వీట్లతో భువనేశ్వరికు కృతజ్ఞతలు వెల్లువల వస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 11:00 PM