Share News

AP Elections 2024: వైసీపీకి 151 మించి సీట్లు వస్తే.. పీకే మరో సంచలనం!

ABN , Publish Date - May 21 , 2024 | 03:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ గ్యాప్‌లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా పరిస్థితులు నెలకొన్నాయి.

AP Elections 2024: వైసీపీకి 151 మించి సీట్లు వస్తే.. పీకే మరో సంచలనం!

  • నా ముఖంపై పేడ కొడతారు!

  • లేదంటే జగన్‌కే అది జరుగుతుంది: పీకే

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ (YS Jagan) చెప్పినట్లుగా వైసీపీకి 151 మించి అసెంబ్లీ సీట్లొస్తే తన ముఖాన పేడకొడతారని.. లేదంటే ఆయనకే అది జరుగుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) వ్యాఖ్యానించారు. ఇటీవల విజయవాడ ఐ-ప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన జగన్‌ .. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ ప్రభావమేమీలేదంటూ తేలిగ్గా మాట్లాడారు. ఐప్యాక్‌ టీమ్‌ హెడ్‌ రుషిరాజ్‌ బృందమే వైసీపీ కోసం కష్టపడినట్లు తెలిపారు. ఏపీలో ఫలితాలపై తాజాగా యూట్యూబ్‌ చానల్‌ మోజో జర్నలిస్ట్‌ బర్కా దత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ స్పందించారు.

ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!



Prasanth-Kishor.jpg

రాసిపెట్టుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని పునరుద్ఘాటించారు. టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రానుందని తెలిపారు. దేశంలో మళ్లీ బీజేపీయే గెలుస్తుం దని స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. మళ్లీ ఆయన సారథ్యంలోనే కేంద్రంలో సర్కారు ఏర్పడుతుందన్నారు. అయితే తామే రాబోతున్నామని రాహుల్‌ గాంధీ, తేజస్వి యాదవ్‌లాంటివారు కూడా చెబుతున్నారని.. జగన్‌ మాటలూ అలాంటివేనని పీకే కొట్టిపారేశారు. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాలు ఏర్పడవన్నారు.

YS Jagan London Trip: 4 గంటలు ఆలస్యంగా లండన్‌కు జగన్‌.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది..!?


Read Latest AP News and Telugu News


Updated Date - May 21 , 2024 | 08:13 AM