Share News

AP News: గర్భిణిపై వైసీపీ గూండాల అమానుషం.. టీడీపీకి ఓటు వేసిందని..

ABN , Publish Date - May 15 , 2024 | 07:20 AM

ఎక్కడ ఓడిపోతామోనన్న భయాందోళనలు వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీకి ఓటు వేయని వారందరిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెళ్లకూరులో అరుణ అనే గర్భిణి, ఆమె సోదరుడిపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశాయి. టీడీపీకి ఓటు వేసిందంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడటమే కాకుండా అరుణని కడుపు మీద కాళ్లతో తన్నారు.

AP News: గర్భిణిపై వైసీపీ గూండాల అమానుషం.. టీడీపీకి ఓటు వేసిందని..

నెల్లూరు: ఎక్కడ ఓడిపోతామోనన్న భయాందోళనలు వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీకి ఓటు వేయని వారందరిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెళ్లకూరులో అరుణ అనే గర్భిణి, ఆమె సోదరుడిపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశాయి. టీడీపీకి ఓటు వేసిందంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడటమే కాకుండా అరుణని కడుపు మీద కాళ్లతో తన్నారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ముందుగా శ్రీకాళహస్తిలోని ఆసుపత్రికి తరలించి.. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పెళ్లకూరులో వైసీపీ గూండాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టీడీపీకి ఓట్లు వేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. భయంతో గ్రామస్తులు భీతిల్లుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

మోదీ ఆస్తి రూ.3.2 కోట్లు

Read Latest AP News and Telugu News

Updated Date - May 15 , 2024 | 07:20 AM