Share News

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

ABN , Publish Date - Jun 16 , 2024 | 02:47 PM

ఫాదర్స్ డే సందర్భంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(APPCC President Sharmila) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhar Reddy) గురించి, ఆమెపై ఆయన ప్రభావం గురించి పలు అంశాలు చెప్పారు.

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

అమరావతి: ఫాదర్స్ డే సందర్భంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(APPCC President Sharmila) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhar Reddy) గురించి, ఆమెపై ఆయన ప్రభావం గురించి పలు అంశాలు చెప్పారు. "నీ పట్టుదల, పోరాట పటిమ ఆస్తిగా ఇచ్చి జీవితంలో ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు. నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్లను ఎదుర్కొనేలా తయారు చేశావు. ప్రేమ, సంస్కారం, కరుణతో మనుషుల హృదయాలు గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావు. నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నా. ప్రజల కోసం పాటుపడే నీ ఓర్పు, నిబద్ధత వారసత్వంగా తీసుకుని ముందుకు సాగుతున్నా. నువ్వెక్కడున్నా నీ ఆశీర్వాదం, అనురాగం, మార్గదర్శనం నాతో ఉన్నాయని తలుస్తా" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Updated Date - Jun 16 , 2024 | 02:47 PM