Share News

YCP Overaction: టీడీపీ వాహనాలపై వైసీపీ కార్యకర్తల దాడి

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:56 PM

అన్నమయ్య జిల్లా: ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. కక్షతో టీడీపీ నేతలపై కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, బోయపల్లెలో టీడీపీ వాహనాలపై దాడి చేశారు.

YCP Overaction: టీడీపీ వాహనాలపై వైసీపీ కార్యకర్తల దాడి

అన్నమయ్య జిల్లా: ఏపీ (AP)లో అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు (YCP Leaders) అక్కసు వెళ్లగక్కుతున్నారు. కక్షతో టీడీపీ నేతల (TDP Leaders)పై కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా (Annamaya District), రాయచోటి మండలం (Rayachoti Mandal), బోయపల్లె (Boyapalle)లో టీడీపీ వాహనాలపై (TDP vehicles) దాడి (Attack)చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి జరిగిన సమయంలో కారులో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి (Nischal Nagireddy) ఉన్నారు. వైసీపీ నేతల దాడిలో టీడీపీ వాహనాలు ధ్వంసమయ్యాయి.


మాధవరం గ్రామంలో టీడీపీ నేత ఇచ్చిన డిన్నర్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. విషయం తెలుసుకున్న రాంప్రసాద్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై రాంప్రసాద్ బాధితులతో కలిసి వెళ్లి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని ఆయన పోలీసులను కోరారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు నివాసానికి వచ్చిన మాజీ డి.జీ. ఏబీ వెంకటేశ్వరరావు

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!

వైసీపీలో కలకలం

జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 06 , 2024 | 01:58 PM