Share News

AP Politics: బీజేపీ నేతలతో ముగిసిన భేటీ.. పవన్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Mar 10 , 2024 | 10:00 PM

Andhra Pradesh Elections : విజయవాడలో బీజేపీ(BJP), జనసేన(Janasena) నేతల భేటీ ముగిసింది. గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. పొత్తులో భాగంగా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఒడిస్సా ఎంపీ ఒబైజయంత్ పాండా, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు.

AP Politics: బీజేపీ నేతలతో ముగిసిన భేటీ.. పవన్ ఏమన్నారంటే..
BJP, Janasena Meeting

Andhra Pradesh Elections : విజయవాడలో బీజేపీ(BJP), జనసేన(Janasena) నేతల భేటీ ముగిసింది. గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. పొత్తులో భాగంగా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఒడిస్సా ఎంపీ ఒబైజయంత్ పాండా, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై నేతలు చర్చించారు.

అయితే, భేటీ అనంతరం నేతలు చడీచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. చర్చల సారాంశం వెల్లడిస్తారనుకున్న పవన్ సైతం ఏమీ స్పందించకుండా వెళ్లిపోయారు. సోమవారం నాడు అన్ని వివరాలు తెలియజేస్తానంటూ వెళ్లిపోయారు పవన్. కాగా, సోమవారం నాడు బీజేపీ, జనసేన నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపటి భేటీలో పోటీలపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. ఈ స్థానాల్లో లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల నేతలు చర్చించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2024 | 10:00 PM