Share News

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..

ABN , Publish Date - Sep 07 , 2024 | 07:41 PM

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం పడుతున్నా.. వరద నీటిలో ఆయన పర్యటించారు. భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు.

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో (Flood Affected Areas)మూడు గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం (Heavy Rains) పడుతున్నా.. వరద నీటిలో ఆయన పర్యటించారు. (Traveled Flood Waters) భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. సింగ్ నగర్‌లో ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు సయితం చంద్రబాబు వెళ్లారు. సింగ్ నగర్ నుంచి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్ పేట, ఓల్డ్ ఆర్ఆర్ పేట, పైపుల రోడ్డుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కాన్యాయ్‌లో కలెక్టరేట్‌కు వెళ్లారు.


ఆయా ప్రాంతాల్లో వరద బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహారం, నీరు సరఫరాపై ఆరా తీసారు. ఆయా ప్రాంతాల వరద బాధితులు సీఎంతో తమ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆహారం, నీరు దొరుకుతున్నా వరద ముంపుతో తాము తీవ్రంగా నష్టపోయామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, వాహనాలు వదర నీటికి దెబ్బ తిన్నాయని, తమను ఆదుకోవాలని మహిళలు సీఎం చంద్రబాబును కోరారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తైనందున ఆదివారం లేదా సోమవారం ఉదయానికి వరద సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.


యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చివేత

కాగా బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడు గండ్లను విజయవంతంగా పూర్తి చేశామని, అనుకున్న సమయానికికంటే ముందుగానే పనులు పూర్తి చేశామన్నారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం ఎంత అని మంత్రి అన్నారు.


బుడమేరు ముంపు బడుగుల జీవితాలనే కాదు.. చిన్న తరహా పరిశ్రమలను ముంచేసింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో విజయవాడ రూరల్ ప్రాంతాల్లో ఉన్న అనేక పరిశ్రమలు నీట మునిగాయి. కోట్ల రూపాయలు విలువ చేసే సరుకు, మిషనరీ మొత్తం పనికిరాకుండా పోయింది. ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉన్న పరిశ్రమలన్నీ మూసివేయడం తప్ప మరో మార్గం లేదని నిర్వాహకులు అంటున్నారు.


బుడమేరు వరద అపారమైన నష్టాల్ని మిగిల్చింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో నిలవ ఉంచిన సామాగ్రి వరదకు కొట్టుకుపోయింది, ఇలాంటి వదర ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని పరిమశ్రల నిర్వాహకులు చెబుతున్నారు. నాలుగు అడుగుల నుంచి ఏడు అడుగుల నీరు అర గంటలో వచ్చిందని.. దీంతో సామగ్రి, యంత్రాలను సేవ్ చేసుకునే అవకాశం లేదని, వరద నీటికి బయటకు రాలేకపోయామని నిర్వాహకులు వాపోయారు. బుడమేరు ప్రక్షాళన లేకపోవడమే దీనంతటికి కారణమని అంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెగిన చెరువు కట్ట.. దీన పరిస్థితిలో గ్రామస్థులు

గేట్లను ఢీ కొట్టిన బోట్లు.. యజమానుల ఆచూకీ లభ్యం..

దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు..

విజయవాడ వాసులకు మరో చేదు వార్త..

గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 07 , 2024 | 07:41 PM