Share News

AP News: సీఎం చంద్రబాబు నిర్ణయంతో సీపీఎస్ ఉద్యోగుల హర్షం..

ABN , Publish Date - Jul 16 , 2024 | 01:00 PM

అమరావతి: జీపీఎస్ అమలు తేదీని సూచిస్తూ వచ్చిన ఉత్తర్వులు, గెజిట్ నోటిపికేషన్‌ను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. తనకు తెలసిన వెంటనే దాన్ని నిలుపుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

AP News: సీఎం చంద్రబాబు నిర్ణయంతో సీపీఎస్ ఉద్యోగుల హర్షం..

అమరావతి: జీపీఎస్ (GPS) అమలు తేదీని సూచిస్తూ వచ్చిన ఉత్తర్వులు, గెజిట్ నోటిపికేషన్‌ (Gazette Notification)ను ఏపీ ప్రభుత్వం (AP Govt.) పక్కన పెట్టింది. తనకు తెలసిన వెంటనే దాన్ని నిలుపుదల చేస్తూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ మేరకు నిర్ణయం తసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), ఎమ్మెల్సీలు అశోక్ బాబు (Ashokbabu), ఏఎస్ రామకృష్ణ (AS Ramakrishna)లకు సీపీఎస్ ఉద్యోగులు (CPS Employees) ధన్యవాదాలు తెలిపారు.


జీపీఎస్‌పై జీవోని వెనక్కి తీసుకోవడంపై సీపీఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసి జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. సీపీఎస్ ఉద్యోగులతో పాటు అందరూ దానిని వ్యతిరేకించామని, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా బలవంతంగా జీపీఎస్‌ను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ జీవోను కొంతమంది అధికారులు బయటపెట్టారని, పాత ప్రభుత్వం తాలూకా వాసన ఇంకా అధికారులకు పోయినట్లు లేదని అన్నారు. జీపీఎస్ జీవో బయటికి రావడంపై ఉద్యోగులు ఆందోళన చెందారని, ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో జీవోని నిలుపుదల చేసారు. జీవో నిలుపుదలకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లక్షలాదిమంది సీపీఎస్ ఉద్యగులు ధన్యవాదాలు తెలిపారు.


కాగా జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించిన గ్యారంటీ పింఛన్ స్కీమ్‌కు బ్రేకులు పడ్డాయి. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంకటంగా పరిణమించిన జీపీఎస్ అమలును నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ జీవో జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేయాలని నిర్ణయించింది. ఇటీవల జీపీఎస్ విధానాన్ని పాత తేదీతో అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో సదరు జీవోను తక్షణం నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త

పిన్ని టార్చర్.. నిజామాబాద్‌లో దారుణం..

పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ కేసు నిందితులు..

జగన్ ఇలాంటివి చాలా చేశారు..

జీపీఎస్ జీవోకు బ్రేక్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 01:01 PM