Share News

Goneprakash: ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యం

ABN , Publish Date - Aug 10 , 2024 | 01:18 PM

Andhrapradesh: ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం రాజకీయాల్లో ఓనమాలు తెలియవని భావన కలుగుతోందన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దివంగత నేత, మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు భగవంతుడితో సమానమన్నారు.

Goneprakash: ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యం
Former MLA Gone Prakashrao

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు (Former MLA Gone Prakashrao) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం రాజకీయాల్లో ఓనమాలు తెలియవని భావన కలుగుతోందన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దివంగత నేత, మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు భగవంతుడితో సమానమన్నారు. దయచేసి, ఇలాంటి డిమాండ్లు చేసి నవ్వుల పాలు కావొద్దని హితవుపలికారు.

Duvvada Sreenivas: వాణి, మాధురి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన దువ్వాడ


ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శిశుపాల, రావణాసుర వధ జరిగిందన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేగా మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడిని (CM Chandrababu Naidu) ఇటీవల కలిశానన్నారు. ఏమీ ఆశించి కలవలేదని.. ఎలాంటి రాజకీయ పదవులు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ‘‘నేను సి.ఆర్ ఫౌండేషన్ వారి ‘‘వృద్దాశ్రమం’’ (ఓల్డ్ ఏజ్ హోమ్)లో ఉంటున్నాను.. నేను చనిపోయేంత వరకు వృద్దాశ్రమంలోనే ఉంటాను. నేను ఒక రాజకీయ విశ్లేషకుడిని మాత్రమే’’ అని గోనెప్రకాష్ రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: హైదరాబాద్‌లో జోయిటిస్ విస్తరణ

Mandakrishna: గతంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 10 , 2024 | 01:26 PM