Share News

Anitha: జగన్‌ను పులికేశితో పోలుస్తూ అనిత సెటైర్...

ABN , Publish Date - Sep 28 , 2024 | 12:18 PM

Andhrapradesh: తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అంటూ మండిపడ్డారు.

Anitha: జగన్‌ను పులికేశితో పోలుస్తూ అనిత సెటైర్...
Home Minister Vangalapudi Anitha

అమరావతి, సెప్టెంబర్ 28: తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదు అంటూ హోంమంత్రి వంగలపూడి (Home Minister Vangalapudi Anitha) అనిత ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ (Former Minister YS Jagan) చెప్పినవన్నీ కుంటి సాకులే అంటూ వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అంటూ మండిపడ్డారు. లడ్డూ టేస్ట్ గురించి మాట్లాడిన జగన్ ఏ రోజు తిరుమల లడ్డూ రుచి చూశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

Bhavika Mangalanandan: పాకిస్థాన్ సంగతి ప్రపంచానికి తెలుసు



మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు...

డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు అంశాన్ని ముడిపెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని తెలిపారు. హిందూ దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికీ అర్ధమవుతుందన్నారు.


దేశ బహిష్కరణ చేయాల్సిందే..

దేశాన్ని కించపరుస్తున్న జగన్‌ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్‌తో తనని దేశ బాహిష్కరణ చేయాల్సిన పరిస్థితి జగనే తెచ్చుకున్నారన్నారు. జగన్‌కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్‌లో చుట్టి పక్కన పెట్టేయటం, అక్షింతలు వేస్తే తలదులేపుసుకున్న సందర్భాలు ఎన్నో చూడలేదా అని అన్నారు.

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..



అన్నీ కట్టు కథలే..

నిన్న జగన్ పర్యటన సందర్భంగా ఒక్కరినైనా బైండోవర్ చేశామా లేక గృనిర్బంధం చేశామా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణకు సాధారణంగా అమల్లోకి తెచ్చే సెక్షన్ 30 యాక్ట్ తెస్తే తనకే అది జారీ చేసినట్లు జగన్ కథలు అల్లారని మండిపడ్డారు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావలనుకునే తత్వం జగన్‌ది కాబట్టే ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నారంటూ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Buddha Venkanna: నిన్ను ఆపింది ఆ శ్రీవారే.. జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్

Kollu Ravindra: జగన్ తిరుమల పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 12:26 PM