Share News

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

ABN , Publish Date - Feb 09 , 2024 | 10:42 PM

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా నందిగామ, జగ్గయ్య పేటలో భువనేశ్వరి పర్యటించారు.

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

ఎన్టీఆర్: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా నందిగామ, జగ్గయ్య పేటలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదనతో మరణించిన అభిమానుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మార్గంలో ఉన్న చిన్నారులను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించి చాక్లెట్లు తినిపించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం, గౌరవరం గ్రామంలో భువనేశ్వరి కాన్వాయ్ వస్తోందని వేదవిద్యావన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల వ్యాన్‌ను పోలీసులు వెనక్కి పంపించారు. ఇది గమనించి ఆ స్కూల్ పిల్లల వద్దకే భువనేశ్వరి వెళ్లారు. స్కూలు విద్యార్థులు కూర్చున్న వ్యానులో కూర్చుని వారితో ఆమె ముచ్చటించారు. ‘బాగా చదవండి..మీ తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకు రావాలి’ అని భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు.

Updated Date - Feb 09 , 2024 | 10:42 PM