Share News

Buddavenkanna: నువ్వా పేదల కోసం మాట్లాడేది.. జగన్‌పై బుద్దా ఫైర్

ABN , Publish Date - Oct 08 , 2024 | 11:04 AM

Andhrapradesh: ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారని.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలుభరించలేకపోతున్నారని అన్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి అంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

Buddavenkanna: నువ్వా పేదల కోసం మాట్లాడేది.. జగన్‌పై బుద్దా ఫైర్
TDP Leader Buddha Venkanna

విజయవాడ, అక్టోబర్ 8: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddhavenkanna) ఫైర్ అయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వరదల సమయంలో చంద్రబాబు(CM Chandrababu Naidu) ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారని.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు (YSRCP Leader) భరించలేకపోతున్నారని అన్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

mother: పాప కోసం..అమ్మ వచ్చేసింది..!


అబద్దాలు ప్రచారం చేసే అడ్రెస్ లేకుండా పోయారన్నారు. మళ్లీ చేస్తే... ‌‌వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం (AP Govt) సహాయక చర్యలు చేపట్టిందన్నారు. ‘‘వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్.. ఏనాడైనా బురదలో అడుగు పెట్టి ప్రజలను కలిశావా. నువ్వా పేద ప్రజల కోసం మాట్లాడేది. వరద బాధితులకు నువ్వెంత సహాయం చేశావు. కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారు. సిగ్గు, శరం‌ లేకుండా అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తావా’’ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

CM Chandrababu: బెజవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి


విపత్తు ఎప్పుడు వచ్చినా నేనున్నా అని ప్రజలతో ఉండే సీఎం చంద్రబాబు అని అన్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ కూడా నీతులు వల్లిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడానికి కూడా అర్ధం లేదా వైసీపీకి అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే కుట్రలను తిప్పి కొడతామన్నారు. జగన్‌కు సిగ్గుంటే ఇప్పుడు అయినా మనసు మార్చుకోవాలన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ప్రజలు జగన్‌ను పరిమితం చేశారని.. ఇలాంటి కుట్రలు చేస్తే ఒక్క స్థానం కూడా ఉండదని హెచ్చరించారు. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలే తరిమి కొడతారన్నారు. ‘‘జగన్ ప్రజలకు సేవ చేయడం అలవాటు చేసుకో.. కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకో జగన్’’ అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న హితవుపలికారు.


ఇవి కూడా చదవండి..

తమ్ముళ్లూ.. ఇది తగదు!

CM Chandrababu: బెజవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2024 | 11:15 AM