Share News

TDP: టీడీపీలో చేరిన కుటుంబాలపై పోలీసుల కక్షసాధింపు

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:27 AM

టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల కక్షసాధింపు కార్యక్రమాలు ఎక్కువ అయ్యాయి. టీడీపీలో చేరారనే కారణంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ ఘటన జరిగింది.

 TDP: టీడీపీలో చేరిన కుటుంబాలపై పోలీసుల కక్షసాధింపు

కర్నూలు: తెలుగుదేశం పార్టీ (TDP) నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల కక్షసాధింపు కార్యక్రమాలు ఎక్కువ అయ్యాయి. టీడీపీలో చేరారనే కారణంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కర్నూలు (Kurnool) జిల్లా పత్తికొండలో ఈ ఘటన జరిగింది. పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ కేఈ శ్యామ్ బాబు సమక్షంలో నిన్న 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీలో చేరారని ఆ 20 కుటుంబాలను గురువారం (ఈ రోజు) పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ కారణంగా తమను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆ కుటుంబాలు చెబుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 11:50 AM