Share News

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే

ABN , Publish Date - Mar 19 , 2024 | 02:58 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మరోసారి ‘‘నిజం గెలవాలి’’ యాత్రతో పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను భువనమ్మ పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే

అమరావతి, మార్చి 19: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) మరోసారి ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్రతో పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను భువనమ్మ పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పర్యటించిన భువనమ్మ... పలువురు కార్యకర్తల కుటుంబాలను కలిశారు. ఇప్పుడు తాజాగా మరోసారి నిజం గెలవాలి యాత్ర మొదలుకానుంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి పర్యటించనున్నారు. రేపు (బుధవారం) ఉదయం రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సాగనుంది. ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం బద్వేలు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన కొనసాగనుంది. 22 గూడూరులో, 23 సర్వేపల్లిలో భువనేశ్వరి పర్యటిస్తూ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను కలుసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి...

Wings to Wagon R Car: ‘కారు’కు రెక్కలొచ్చాయ్.. అది చూసిన పోలీసులు ఏం చేశారంటే..

YSRCP: తాడేపల్లికి చేరిన చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ.. ఇంతకీ తేలుతుందా?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 03:28 PM