Share News

Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్షన్

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:00 PM

రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది..

Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్షన్

అమరావతి/తిరుపతి జిల్లా: టీడీపీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను (MLA Koneti Adimulam) హైకమాండ్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ రోజు వివిధ మాద్యమాలలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే) ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది’ అని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. కాగా.. సస్పెన్షన్ తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆరోపణలు తీవ్రత దృష్ట్యా ముందు సస్పెండ్ చేసి తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.


TDP-MLA-Suspended.jpg


1ARrEZRTmMI-HD.jpg

ఏబీఎన్ ఎఫెక్ట్..!

గురువారం ఉదయం నుంచి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ఆదిమూలం వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీనియర్ నేతలు, అధికారులు.. సీఎం నారా చంద్రబాబుకు తెలియజేయగా ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి భయపడేలా ఆ చర్యలు ఉండాలని ఆదేశించారు. దీంతో.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రధాన కార్యాలయం నుంచి గంటల వ్యవధిలోనే ప్రకటన వచ్చేసింది. ఈ సస్పెన్షన్‌తో తప్పు చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని గట్టిగా హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్లు అయ్యింది.


Badhitha-Mahila.jpg

అసలేం జరిగింది..?

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై.. పార్టీకి చెందిన మహిళ కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్ చేసింది. గురువారం నాడు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బాధితురాలు, తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని ఆమె తెలిపింది.


Adimulam-MLA.jpg

ఇదీ అసలు సంగతి..!

ఒకే పార్టీకి చెందిన వాళ్ళము కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారని వెల్లడించింది. అలా పరిచయమైన తరువాత తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడని తెలిపింది. తన మొబైల్ కు పదేపదే కాల్స్ చేసేవాడని.. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లోని రూమ్ నెంబర్ 109 లోకి రమ్మని చెప్పాడని తెలిపింది. అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. అలా తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నానని తెలిపింది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు వెల్లడించింది.


adimulam.jpg

పెన్ కెమెరాతో..

ఇకపై ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో ఉండటానికి అర్హుడు కాడని తెలిపింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశానని వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడని పేర్కొంది. రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని తెలిపింది. రోజుకు ఒక అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడని పేర్కొంది. అందమైన అమ్మాయి కనబడితే చాలు తను తనతో ఉండాల్సిందేనని ఆదిమూలం ఎంతో మందిని టార్చర్ చేశాడని వెల్లడించింది. తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డా అని తెలిపింది. ఇలాంటి వాళ్ళన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఆయనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవొద్దని పేర్కొంది. ఆదిమూలం తమ ఇంటికి వచ్చాడని ఎవ్వరూ సంబరపడి పోవద్దని.. అలా వస్తే మీ భార్య, పిల్లలపై కన్నేస్తాడని పేర్కొంది. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడని.. అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని బాధితురాలు వేడుకొంది.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Updated Date - Sep 05 , 2024 | 02:26 PM