Share News

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి లొంగిపోతారని అనుమానం..అప్రమత్తమైన పోలీసులు

ABN , Publish Date - May 23 , 2024 | 04:01 PM

పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy) బాగోతం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి నరసరావుపేట కోర్టు ఆవరణలో లోంగిపోతారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి పహారా కాస్తున్నారు.

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి లొంగిపోతారని అనుమానం..అప్రమత్తమైన పోలీసులు
Pinnelli Ramakrishna Reddy

పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy) బాగోతం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి నరసరావుపేట కోర్టు ఆవరణలో లోంగిపోతారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి పహారా కాస్తున్నారు. అయితే ఇది కేవలం అనుమానమేనని పోలీసులు వెల్లడించారు. మరోవైపు నరసరావుపేటకు సిట్ అధికారులు మరోసారి చేరుకున్నారు. టూ టౌన్ పట్టణ పీఎస్ పరిధిలో హింసాత్మక ఘటనలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


ఇక రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడుగా ఉండగా, ఆయన కోసం ఇప్పటికే పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గాలిస్తున్నాయి. అయితే నిన్న తెలంగాణ సంగారెడ్డి పరిధిలో పిన్నెల్లి పోలీసుల(police) నుంచి తప్పించుకున్నారు. ఆ క్రమంలో అతని కారును గుర్తించిన పోలీసులు గన్ మెన్, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు పిన్నెల్లి విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.


ఇది కూడా చదవండి:

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 04:03 PM