Home » Pinnelli Ramakrishna Reddy
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల అండతో అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుర కా కిశోర్కు మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకి వచ్చిన వెంటనే పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు (శనివారం) విడుదలకానున్నారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. ఈక్రమంలో పిన్నెల్లికి పలు కండీషన్లపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆయన బెయిల్పై జైలు నుంచి విడుదల అవనున్నారు.
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే.. పిన్నెల్లి రిలీజ్కు బ్రేక్ పడింది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది...
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో వివాదం రాజుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు, ఇతర వెసీపీ నాయకులు పలువురు అక్రమంగా తన ఆస్తులు కబ్జా చేశారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ కుమారుడు దుర్గాశ్రీనివాస్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. గతంలో పిన్నెల్లి అనుచరులు తన వ్యాపారాలను టార్గెట్ చేశారన్నారు.
Andhrapradesh: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు.