MP GVL Narasimha Rao: మహా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తాం
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:33 PM
ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు మహా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ( MP GVL Narasimha Rao ) తెలిపారు.
విశాఖపట్నం: ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు మహా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ( MP GVL Narasimha Rao ) తెలిపారు. శుక్రవారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. టీం జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎల్ దంపతులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ... గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేసి ప్రతిబింబించేలా పండుగ ఏర్పాట్లు చేశామన్నారు. ముగ్గుల పోటీలు, కోలాటం పోటీలు, పంచ కట్టు పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వనితల కోసం ప్రత్యేకంగా తెలుగు అమ్మాయుల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగు రోజులపాటు నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.