Share News

Ramprasad Reddy: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండదు

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:42 PM

క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు.

Ramprasad Reddy: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండదు
Minister Ramprasad Reddy

విశాఖపట్నం: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. Aca-Vdca స్టేడియంలో నేటి నుంచి జూలై 13వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.. టోర్నీలో మొత్తం 6 టీమ్స్ పాల్గొననున్నాయి. బెజవాడ టైగర్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌, కోస్టల్‌ రైడర్స్‌, వైజాగ్ లయన్స్, రాయలసీమ కింగ్స్ పాలు పంచుకోనున్నాయి.

Mandipalli-56-Ramprasad-Red.jpg


మొదటి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ VS కోస్టల్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆణిముత్యాలు ఉన్నారని తెలిపారు. వారందరికీ APL అనేది మంచి వేదికని చెప్పారు. వందలాది మంది క్రీడాకారులకు ఇదో సువర్ణ అవకాశమని అన్నారు. సీఎం చంద్రబాబు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. రాజకీయ ప్రమేయం ఉండటం వల్ల ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Mandipalli-4-Ramprasad-Redd.jpg

Updated Date - Jun 30 , 2024 | 09:07 PM