Share News

Pitani Satyanarayana: పెన్షన్లు పెంచాం... పొద్దు పొద్దున్నే అందించాం

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:04 PM

Andhrapradesh: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని... పొద్దు పొద్దున్నే అందించామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం ఉదయం పెనుగొండలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయంలో పెన్షన్ వెయ్యి పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు.

Pitani Satyanarayana: పెన్షన్లు పెంచాం... పొద్దు పొద్దున్నే అందించాం
MLA Pitani Satyanarayana

పశ్చిమ గోదావరి, జూలై 1: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని... పొద్దు పొద్దున్నే అందించామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ (MLA Pitani Satyanarayana) అన్నారు. సోమవారం ఉదయం పెనుగొండలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయంలో పెన్షన్ వెయ్యి పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని.. భయం వలన వారు రాలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్‌ను ప్రజలు కక్ష కట్టి ఓడించారన్నారు.

KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ


తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాని... జగన్ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. గౌరవం లేని శాసనసభ్యుడు మొన్నటి వరకు ఇక్కడ కొనసాగారన్నారు. టీడీపీ నాయకులకు పెన్షన్లు కట్ చేశారని.. వారికి రావాల్సిన సంక్షేమ పథకాలను నిలిపేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు తమ నాయకులపై ఎన్నో కేసులు పెట్టించారన్నారు. ఇలాంటి అరాచక రాజకీయాలు చూసి... తాను ఈ రాష్ట్రంలోనే పుట్టానా అని అనిపిస్తుందన్నారు. జగనన్న కాలనీల్లో కూడా రోడ్లు వేయటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అధికారులకు స్వతంత్రం వచ్చిందని.. వైసీపీ పాలనలో బానిసలుగా అధికారులు ఉండిపోయారని పితాని సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి....

Sharmila: మోదీ సర్కార్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న మీరు.. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 02:04 PM