Share News

AP Politics: ముద్రగడ ఏ పార్టీలో చేరనున్నారో చెప్పిన కుమారుడు గిరిబాబు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:40 PM

Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ, జనసేన నేతల వరుస భేటీలపై ఆయన కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గిరిబాబు మాట్లాడుతూ.. ముద్రగడ... టీడీపీ, జనసేన ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

AP Politics: ముద్రగడ ఏ పార్టీలో చేరనున్నారో చెప్పిన కుమారుడు గిరిబాబు

కాకినాడ, జనవరి 11: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ, జనసేన నేతల వరుస భేటీలపై ఆయన కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గిరిబాబు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన ఏ పార్టీలోకైనా ముద్రగడ వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరని తెలిపారు.

ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నామని.. ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందని తెలిపారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. మరిన్ని చర్చలు జరుగుతాయన్నారు. గతంలోనే చెప్పినట్టు ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటామని.. త్వరలోనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని గిరిబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 11 , 2024 | 12:58 PM