Home » Mudragada Padmanabham
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరగనున్న నేపథ్యంలో కౌన్సిలర్లను ఎన్నికకు రాకుండా చేసేందుకు వైఎస్పార్సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేశారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవుతారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Sana Satish: ముద్రగడ పద్మనాభరెడ్డి, వైసీపీపై తెలుగుదేశం ఎంపీ సానా సతీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి డ్రామానే అని ఆరోపించారు. ఈ దాడి వైసీపీ చేయించినట్లుగా ఉందని సానా సతీష్ అనుమానం వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం ముందు ఓ యువకుడు మద్యం సేవించి హల్ చల్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్తో వచ్చి బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు.
Mudragada Padmanabha Reddy: వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదన్నది తెలుసుకొని లోకేష్కు మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో ముద్రగడకు బుద్దా బహిరంగ లేఖ రాశారు.
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.
ఎన్నికల సమయంలో కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీరును సొంత కూతురు ముద్రగడ క్రాంతి తప్పు పట్టారు. పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడంతో క్రాంతి ఘాటుగా స్పందించారు. ఆ సమయంలో తండ్రికూతుళ్ల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఇప్పుడు మళ్లీ మాటల యుద్ధం మొదలైంది.
ఎన్నికల సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సవాలు చేస్తుంటారు. పేరు మార్చుకుంటానని కొందరు, ముక్కు నేలకు రాస్తానని మరికొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరికొందరు.. క్షమాపణలు చెప్తానంటూ ఇలా ఎన్నో రకాల సవాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో సవాళ్లు విసిరిన ఆ పార్టీ సీనియర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడా.. ఎవరి మాటా.. వినిపించడం లేదు. అయితే ప్రచారం సమయంలో అతికి పోయి సవాల్ చేసిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత వంగా గీతపై ఘన విజయం సాధించారు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగిన సమయంలో.. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు.