Share News

YCP: వలంటీర్లతో వైసీపీ సమావేశం

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:58 AM

కాకినాడలోని నాగమల్లితోట జం క్షన్‌ సమీపంలో గురువారం వైసీపీకి చెందిన గుత్తుల సూర్యప్రకాశ్‌ వలంటీర్లతో సమావేశ మైనట్టు వచ్చిన సమాచారంతో కాకినాడ రూరల్‌ జనసేన అభ్యర్థి పంతం నానాజీ కార్యకర్తలతో కలసి వెళ్లి వలంటీర్లను నిలదీశారు.

YCP: వలంటీర్లతో వైసీపీ సమావేశం

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 11: కాకినాడలోని నాగమల్లితోట జం క్షన్‌ సమీపంలో గురువారం వైసీపీకి చెందిన గుత్తుల సూర్యప్రకాశ్‌ వలంటీర్లతో సమావేశ మైనట్టు వచ్చిన సమాచారంతో కాకినాడ రూరల్‌ జనసేన అభ్యర్థి పంతం నానాజీ కార్యకర్తలతో కలసి వెళ్లి వలంటీర్లను నిలదీశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్‌తోపాటు పలువురు గోడదూకి పరారయ్యారని నానాజీ తెలిపారు. సంఘటనా స్థలానికి విచ్చేసిన సర్పవరం ఎస్‌హెచ్‌వో వైఆర్‌కే శ్రీనివాస్‌, ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి వెంకటపతిరాజులకు నానాజీ ఫిర్యాదు చేశారు.

Updated Date - Apr 12 , 2024 | 08:58 AM