Share News

Andhra Pradesh: కాలేజీ బాత్‌రూమ్ లో తీవ్ర రక్తస్రావం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి..

ABN , Publish Date - Jan 27 , 2024 | 05:48 PM

నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాణ్యం మండలం ఆర్.జీ.యం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి.

Andhra Pradesh: కాలేజీ బాత్‌రూమ్ లో తీవ్ర రక్తస్రావం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి..

నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాణ్యం మండలం ఆర్.జీ.యం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి. మృతురాలు ఉమామాధురిగా గుర్తించి.. ఆమె సివిల్ ఇంజినీరింగ్ చదువుతోందని పోలీసులు తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో కాలేజీ హాస్టల్ లోని బాత్రూంలో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడిక్కకడే మృతి చెందింది.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఉమామాధురి స్వగ్రామం వెల్దుర్తి మండలం చేరకులపాడు.

Updated Date - Jan 27 , 2024 | 05:48 PM