Share News

Collector Jitesh: కుసుమ హరినాథ్ బాబా ఆలయ ఈశాన్య మండపం కూల్చండి..

ABN , Publish Date - Aug 07 , 2024 | 12:25 PM

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిర ఈశాన్య మండపం కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన మండపాన్ని కూల్చివేసి పరిస్థితి చక్కదిద్దాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Collector Jitesh: కుసుమ హరినాథ్ బాబా ఆలయ ఈశాన్య మండపం కూల్చండి..

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిర ఈశాన్య మండపం కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన మండపాన్ని కూల్చివేసి పరిస్థితి చక్కదిద్దాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండపం పైభాగం పెచ్చులూడి పడి భక్తులకు భారీ ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఈశాన్య మండపాన్ని స్వయంగా పరిశీలించారు.


పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చివేయాలంటూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద స్లూయిజ్‌లను కలెక్టర్ పరిశీలించారు. ఇవాళ కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన రామాలయ పరిసర ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. కలెక్టర్ అదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు స్లూయిజ్ లాక్‌లు ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదిలారు.

Updated Date - Aug 07 , 2024 | 12:36 PM