Share News

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:29 AM

ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ, అక్టోబరు 14: ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది. అయితే ఆ తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. వీటిలో న్యూయార్క్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. సోమవారం తెల్లవారుజామున 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఈ విమానం న్యూయార్క్‌ బయలుదేరిందని అధికారులు తెలిపారు. ముంబయి నుంచి బయలుదేరే మరో రెండు ఇండిగో విమానాలకు కూడా సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. వాటిలో ఒకటి మస్కట్‌, మరొకటి జెడ్డా వెళాల్సి ఉంది. అయితే ఈ రెండు విమానాలకు టేకాఫ్‌ అవ్వకముందే బెదిరింపు రావడంతో వాటిని ఐసొలేషన్‌ బేకి తరలించారు.

Updated Date - Oct 15 , 2024 | 04:29 AM