Share News

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా ఉంటాయి

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:26 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు.

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు  భిన్నంగా ఉంటాయి

న్యూఢిల్లీ, జూన్‌ 3: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు. అనంతరం ‘మంగళవారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై మీ అంచనాలు ఏమిట’ని పీటీఐ ప్రతినిధి అడగ్గా ఆమె బదులిస్తూ ఎగ్జిట్‌ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఫలితాలు ఉంటాయని తమ పార్టీ ఆశాభావంతో ఉందని, రేపటి వరకు వేచి చూడాలని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ బోగస్‌ అని కాంగ్రెస్‌ నాయకులు కొట్టిపారేశారు.

Updated Date - Jun 04 , 2024 | 03:27 AM