Share News

13 మంది రెబెల్స్‌పై కాంగ్రెస్‌ వేటు

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:38 AM

అసెంబ్లీ ఎన్నికల వేళ 13 మంది తిరుగుబాటు నేతలపై హరియాణా కాంగ్రెస్‌ చర్యలు తీసుకుంది.

13 మంది రెబెల్స్‌పై  కాంగ్రెస్‌ వేటు

చండీగఢ్‌, సెప్టెంబరు 27: అసెంబ్లీ ఎన్నికల వేళ 13 మంది తిరుగుబాటు నేతలపై హరియాణా కాంగ్రెస్‌ చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వీరిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్త్తున్నట్లు హరియాణా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉదయ్‌భాన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగిన సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి సంపత్‌ సింగ్‌, మాజీ ఎమ్మెల్యే జస్బీర్‌ మాలౌర్‌, రామ్‌ కిషన్‌ ‘ఫౌజీ’ తదితరులు పార్టీ నాయకత్వం బుజ్జగించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అంబాల కంటోన్మెంట్‌ నుంచి బరిలో ఉన్న చిత్రా సర్వారపై కాంగ్రెస్‌ వేటువేసింది. హరియాణాలో అక్టోబరు 5న ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - Sep 28 , 2024 | 04:38 AM